మహాభారతం..మనకు తెలిసినది ఎంత?.....1

Monday, February 14, 2011

                        మహాభారతం..ఇది వినగానే మనకి గుర్తుకువచ్చేది..పాండవులు,కౌరవులు,కృష్ణుడు..ఇంక యుద్ధం..ఇంతకంటే చాలా మందికి ఎక్కువగా తెలియదు.
                         అసలు భారతం ఎవరు రాసారు? మనకి తెలిసిన భారతం అదేనా?


  మనకి తెల్సి మనం వింటున్న భారతం..రాసింది  వ్యాసుడు.. కాదు..వినాయకుడు రాసాడు..కాని అది చెప్పింది మాత్రం వ్యాసుడే.అసలు ఈ వ్యాసుడు ఎవరు?....
     వ్యాసుడు అసలు పేరు "కృష్ణ ద్వైపాయన",ఇతని తల్లి ఒక జాలరి,తండ్రి పరాశరుడు,పరాసురుడు వశిష్ఠుడుని(సప్త ఋషులలో  ఒకడు) మనుమడు .ఈ సప్త ఋషులు మొదట వేదం విన్న వారు.ఈ కృష్ణ ద్వైపయనకు వేద వ్యాసుడని(వేదాలు విభజించి రాసాడు కాబట్టి)కూడా పేరు.
  ఈ మహాభారతంలో ఉన్నవారంతా వ్యాసుని మనుమలే.ఈ భారతం మొత్తం అరవై భాగాలుగా ఉండేదంట.అందులో ఒక భాగం మనకు తెలిసింది,అదీ వ్యాసుని శిష్యుడు వైసంపాయన ద్వారా తెలిసింది.మొత్తం కథ.... అనగా వ్యాసుడు వినాయకుడికి చెప్పింది ఎవరికి తెలియదు..ఈ ఒక్క భాగం తప్ప.అది ఎలా అంటే.
    వైసంపాయన ఈ కథ జనమేజయుని యజ్ఞ స్థలిలో చెప్పాడు..ఈ జనమేజయుడు పాండవ అర్జునుని మునిమనవడు.ఇలా చెప్పేటప్పుడు ఒక దాసరి రోమహర్షణ అనే అతను విని,ఇది తన కొడుకు ఉగ్రస్రావుడుకి వర్ణించాడు.అతడు నైమిష అరణ్యములో ఉన్నశౌనకాది మునులకి చెప్పాడు.
    వ్యాసుడు భారతాన్ని తన కొడుకు శుకుడుకి కూడా చెప్పాడు.ఇది శుకుడు పరీక్షిత్తుడికి చెప్పాడు.
    వ్యాసుని శిష్యులలో జైమిని అనే శిష్యుడు కూడా గురువు దగ్గర ఈ కథ విన్నాడు..కాని తనకి సందేహాలు ఎక్కువ ఉండేవి.తన సందేహాలను నివృత్తి చేసుకుందాము అనుకున్నాడు కాని ఆ సమయానికి వ్యాస మహర్షి లేడు.జైమిని మార్కండేయుని దగ్గరకు వెళ్ళాడు...కాని మార్కండేయుడు మౌన వ్రతంలో ఉన్నాడు..అప్పుడు మార్కండేయుని శిష్యులు జైమినిని ఒక నాలుగు పక్షులు ఉన్నాయి వాటి దగ్గరకు వెళ్ళు అవి చెప్తాయి అని పంపుతారు.(అవి ఏమీ పక్షులో నాకు తెలియదు :)...).ఈ నాలుగు పక్షుల దగ్గరికి ఎందుకు పంపారు? ఎందుకంటే ఇవి కురుక్షేత్ర యుద్ధంలో ఉన్నాయంట.అది ఎలా అంటే..యుద్ధస్థలిలో వీటి తల్లి అలా ఎగురుతూ వెళుతుంటే ఒక బాణం వచ్చి ఈ పక్షికి తగులుతుంది.అలా తగిలినప్పుడు దీని కడుపులో ఉన్న నాలుగు గుడ్డులు కింద పడ్డాయంట.(కింద పడితే పగలవా అనొద్దు)..అవి ఎందుకు పగలలేదంటే..అది ఆ యుద్ద భూమి మొత్తం రక్తం తో నిండి ఉండీ..పగలలేదు అని..అలా పడ్డ గుడ్డల మీద ఒక ఏనుగు గంట పడి..అంటే వాటికి తగలకుండా..ఆ గుడ్డులు కాపాడబడ్డాయి అని.యుద్ధం అయిపోయినాకా కొందరు ఋషులు గంట కింద ఉన్న పక్షులని చూసి..ఇవి మనుషులకంటే యుద్ధం గురుంచి ఎక్కువ తెలుసుకున్నాయి అని వీటికి వాక్కు ప్రసాదించారని వినికిడి. ఈ పక్షులు జైమిని సందేహాలని చాలా వరకు తీర్చి ఇంక ఎవరికి తెలియనివి కూడా చెప్పాయి.
    అసలు వ్యాసుడు భారతానికి పెట్టిన పేరు 'జయ' అది కాస్త అలా నలుగురికి పాకుతూ 'విజయ' అయ్యింది.అలా అలా అయ్యి మొత్తానికి 'భారతం' అని పేరు తెచ్చుకుంది.(భారతం అని ఎందుకు వచ్చింది అంటే భారత వంశానికి సంబందించిన వారి గురుంచి కాబట్టి)
                                                                                                                                      (ఇంకా వుంది)

3 comments:

Anonymous said...

chala informative ga undi mee post, bharatham gurinchi kothavi telisayee,
bavundi chala baga rasaru, meeru rasina rushula perlu ayithe andariki teliyakapovachu kuda, continue cheyandi chala teliyanivi telustunnai

Kalidasu said...

good information. keep going

బడ్డి said...

@anonymous,@జై తెలంగాణ..
Thanks for ur comments .. :)

Post a Comment

 
Your Name :
Your Email :
Subject :
Message :
Image (case-sensitive):