మహాభారతం..మనకు తెలిసినది ఎంత?.....2

Tuesday, February 15, 2011

                                   అసురులమీద దేవతలదే పై చేయి ఉండాలని ఎప్పుడూ యజ్ఞాలు జరుగుతూ ఉంటాయి స్వర్గలోకంలో.వీటిని జరిపించే బాధ్యత బృహస్పతిది.అతని భార్య తార ,ఆ యజ్ఞాల సమయంలో అతనితో లేకుంటే ఆ యజ్ఞాలకి ఫలమే ఉండదు.ఎప్పుడూ పూజలలో ఉండే బృహస్పతి మీద చిరాకు పుట్టి ఒకరోజు తార చంద్రుని తో వెళ్ళిపోతుంది.బృహస్పతి దేవతలా రాజైన ఇంద్రుని వద్దకు వెళ్లి ఈ యజ్ఞాలు ఫలించాలి అంటే నా భార్యనీ నాకు ఇప్పించు అని అంటాడు.యజ్ఞ ఫలం లేకుంటే భూలోకం కూడా అతలాకుతలం అవుతుందని ఇంద్రుడు తారనీ బృహస్పతి దగ్గరకు వచేయ్యమని ఆజ్ఞాపిస్తాడు.ఇంక తారకి తప్పక బృహస్పతి దగ్గరకు వస్తుంది..కాని అప్పటికే తార కడుపుతో ఉంటుంది..దానికి బృహస్పతి,చంద్రుడు..ఇద్దరు ఆ పుట్టబోయే వానికి తండ్రి అని చెప్పుకుంటారు..తార ఏమీ చెప్పాక మౌనంగా ఉంటె కడుపు లోని బిడ్డ తన తండ్రి ఎవరో తనకి తెలియాలని తారని అడుగుతుంది.ఆ కడుపులోని బిడ్డ అడిగిన ప్రశ్నకు దేవతలంత హర్షించి...అతనికి బుధుడు అని పిలుస్తారు.ఆ బిడ్డ అడిగిన ప్రశ్నకి జవాబుగా తార..నీవు చంద్రుని కుమారుడివి..అని.అది విన్న బృహస్పతి కోపంతో..ఆ బిడ్డ ఆడా మగ కాని వాడిగా ఉంటాడని శపిస్తాడు. అలా బుధుడు పెరిగి పెద్దవాడవుతాడు.ఒకరోజు తార బుధుడునీ అడుగుతుంది..పెళ్లి చేసుకుంటావ అని..దానికి బుధుడు నన్నెవరు చేసుకుంటారు...భర్తగాన లెక భార్యగాన ?..అప్పుడు అతని తల్లి తార..అతని తండ్రి శాపానికి ఏదో ఒక కారణం ఉండకుండా ఉండదు..ఎవరో ఒకరు దొరుకుతారు చూడు అని.
  ఒక రోజు బుధుడు ఇల అనే ఆమెను చూసి  ప్రేమిస్తాడు...అసలు ఈ ఇల ఎవరు?
       ఇలా ఒకప్పుడు సుద్యుమ్న,మను రాజు కొడుకు.ఒకనాడు వేటకి వెళ్ళినప్పుడు ..ఆ అడవిలో శివుడు శక్తి తో ఉన్నప్పుడు..శక్తి కోరిక మేరకు అంటే ...శక్తి ఆ సమయంలో ఏ మొగ జంతువు కాని..మొగ మనిషి కాని ఆ అడవిలో ఉండకూడదు అంటే శివుడు అనుగ్రహం వల్ల ఆ అడవిలో అన్ని మొగ జంతువులు..పక్షులు అలా ఆడవిగా మారిపోయాయి..ఆ సమయంలోనే సుద్యుమ్న అక్కడే ఉండటం చేతా...ఆడామేగా మారిపోయాడు.అతడు వెళ్లి శక్తి సారాను కోరినప్పుడు..ఆ తల్లి...బయపడకు..శివుని మంత్రం నుండి నేను ఏమీ చెయ్యలేను కాని నీకు ఆ శాపం మారుస్తాను అని..చంద్రుడు తగ్గినప్పుడు నీవు స్త్రీ లాగా...పెరిగినప్పుడు పురుషునిలా ఉంటావు అని వరం ప్రసాదించింది.
      అలా..ఏ ఇల బుధుడుకి భార్యగా అయ్యింది.ఇద్దరికీ చాలా మంది కొడుకులు పుట్టారు.వీలందరూ చంద్రవంశీయులు అని పిలవబడ్డారు.(వీళ్ళు బుధుని పిల్లలు..బుధుడు అసలు తండ్రి చంద్రుడు.అందుకే చంద్రవంశీయులు పిలవబడ్డారు)

No comments:

Post a Comment

 
Your Name :
Your Email :
Subject :
Message :
Image (case-sensitive):