మహాభారతం..మనకు తెలిసినది ఎంత?.....3...పురూరవుడు....

Wednesday, February 16, 2011

ఇలకు,బుధునికి పుత్రుడుగా జన్మించిన వాడు పురూరవుడు. చంద్రవంశంలో ప్రసిద్ధుడైనవాడు. .ఒకనాడు పురూరవుడు జలకాలడుతున్న ఊర్వశినీ చూసి ఇష్టపడ్డాడు. తనని పెళ్లి చేసుకోమని ఆమెను అడిగాడు. ఇతనితో జీవించడానికి ఊర్వశి రెండు షరతులు పెట్టింది.ఒకటి తనతో తప్ప మరెప్పుడూ అతడు ఎవరికి నగ్నంగా కనబడకూడదు. రెండవది తను  పెంచుకుంటున్న మేకలను కాపాడాలి అన్నది. ఈ రెండింటికీ పురూరవుడు ఒప్పుకున్నాడు. వారిద్దరూ ఎన్నో ఏళ్ళు సుఖంగా జీవించారు.చాలా మంది పిల్లలని కన్నారు. ఇల ఉంటె ఊర్వశి లేకపోతే ఇంద్రసభలో ఏమీ అంతగా లేకపోయేసరికి, ఇంద్రుడు ఆమెను తీసుకురావటానికి ఉపాయం చెప్పి, ఇద్దరు గంధర్వులను వాళ్ళదగ్గరికి పంపిస్తాడు.ఆ గంధర్వులు ఒక రాత్రిపూట పురూరవుడు ఊర్వశితో నిద్రిస్తుండగా , ఊర్వశి మేకలను తీసుకొని పారిపోయారు. అది గమనించిన ఊర్వశి పురూరవుడితో మేకలను ఎవరో తీస్కేల్తున్నారు నా మేకలు నాకు తెచ్చి ఇవ్వు.నా షరతులకి ఒప్పుకున్నావు వాటిని కాపాడలేవా అని అతడిని పంపింది.. వెంటనే బట్టలు కూడా  వేసుకోకుండానే ఆ మేకలను తీసుకురావడానికి పరుగెత్తాడు పురూరవుడు. రెండు షరతులలో విఫలం అయ్యాడు అని ఊర్వశి అతడిని వదిలి వెళ్ళిపోయింది.తరువాత కొందరు అంటారు పురూరవుడు పిచ్చివాడై ..అలా తిరుగుత ఏడుస్తూ ఉన్నాడని...కొందరు గందర్వుడుల మారాడు ఊర్వశి వెంట సంగీత కచేరీలు చేస్తూ ఉంటాడు అని..


విశ్లేషణ..
అప్స అనగా నీరు..అప్సరనీ జల దేవత అని కూడా అనొచ్చు...ఏ జలం భూమికి స్వర్గం నుండి వస్తుంది(వర్షం లాగా)..మళ్లి కొన్ని రోజులకి స్వర్గానికి వెళ్ళిపోతుంది(ఆవిరి లాగా)...జలం వల్ల జీవం వస్తుంది..పైన చెప్పినదానిలో అదే ఉంది...అప్సర అంటే ఊర్వశి(జలం),పురూరవుడు మనిషి (మనిషి నీటి కోసం పడే ఆరాటం). మళ్లి ఆకాశానికి(ఇంద్రుడు) వెళ్ళిపోతుంది జలం ఆవిరిలాగా...
  ఊర్వశి ఇల షరతులు ఎందుకు పెట్టింది అనా..వాటికి పురూరవుడు ఎందుకు ఒప్పుకున్నాడు?
      మన సమాజంలో(ఇప్పుడు కాదు పూర్వం)  స్త్రీకి ఒక  ముఖ్యమైన  స్థానం కల్పించారు...తన భర్తని తను సెలెక్ట్ చేసుకోవచ్చు..ఒక స్త్రీ వల్లే పురుషుడు వంశం పెంచి తన పూర్వికుల పాపాలను పోగ్గోట్టుతాడు ..

No comments:

Post a Comment

 
Your Name :
Your Email :
Subject :
Message :
Image (case-sensitive):